![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -256 లొ.....సీతాకాంత్ తన తల్లి పేరు పైన ఆస్తులు రాయాలని నిర్ణయం తీసుకున్నాడు. దాంతో లాయర్ కి చెప్పి డాక్యుమెంట్స్ రెడీ చేయమంటాడు. అప్పుడే లాయర్ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాడు. దాంతో శ్రీవల్లి, శ్రీలత, సందీప్ లు ఆస్తి సొంతం కాబోతుందని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్క సంతకం చేస్తే ఆస్తులు తమ పేరున అయిపోతాయని లాయర్ అంటాడు. సీతాకాంత్ సంతకం చేస్తాడు. ఇక ఆస్తులు అన్నీ కూడా నా తల్లివే అని సీతాకాంత్ అంటాడు.
ఇక నువ్వు ఇక్కడ ఎందుకు అక్కయ్య వెళ్ళిపోమని రామలక్ష్మిని శ్రీవల్లి అనగానే.. వల్లీ అంటూ సీతాకాంత్ తనపై కోప్పడతాడు. అయినా నేను ఎందుకు ఇంట్లో నుండి వెళ్ళాలి చెల్లి.. ఈ ఆస్తులకి యజమానిరాలిని నేనే అని రామలక్ష్మి అనగానే.. అప్పుడే డాక్యుమెంట్స్ అన్ని సందీప్ చూస్తాడు. అవన్నీ కూడా రామలక్ష్మి పేరున ఉండడంతో అందరు షాక్ అవుతారు. ఏంటి లాయర్ గారు నేను మా అమ్మ పేరున చెప్పను కదా అని సీతాకాంత్ అనగానే.. మీరు చెప్పినట్టే చేసానని లాయర్ అంటడు. లాయర్ బయటకు వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ రామలక్ష్మి మారుస్తుంది. లాయర్ గారు మీరు వచ్చిన పని అయింది వెళ్ళండి అని లాయర్ ని రామలక్ష్మి పంపిస్తుంది. ఆస్తుల కోసం ఇదంతా చేస్తావా అని శ్రీలత అంటుంది. నీకు ఆస్తులు ముఖ్యం అయితే నేనే రాసేవాడిని కదా ఎందుకు ఇలా మా వాళ్లపై నిందలు వేసావని సీతకాంత్ అంటాడు.
నేనేం చేసినా మా ఆయన కోసమని రామలక్ష్మి అంటుంది. అలా అయితే ముందే చెప్పాలి కదా ఇలా చెయ్యడం ఏంటని పెద్దాయన, సిరి అంటారు. ఆ తర్వాత రామలక్ష్మి అక్క ఎంత మోసం చేసిందని శ్రీలత , సందీప్ లతో శ్రీవల్లి అంటుంది. అప్పుడే రామలక్ష్మి వచ్చి మాట్లాడుతుంది. నువ్వు గెలిచావనుకుంటున్నావ్ గనీ సీతా మనసులో నీపై నమ్మకం పోయిందని రామలక్ష్మితో శ్రీలత అంటుంది. ఆ తర్వాత నువ్వు ఆస్తులపై ప్రేమ పెంచుకున్నావ్.. అందుకే ఇదంతా చేసావ్.. మోసం చేసావ్ రామలక్ష్మి అని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |